మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను సీఎం కేజ్రీవాల్ను కలుసుకుని అరగంట సేపు ఫోన్ ద్వారా మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మధ్యలో గ్రిల్, అద్దం ఉంది. మరోవైపు సీఎం కూర్చున్నారు. తమ ఇద్దరి ఫోన్ సంభాషణలో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందవద్దని కేజ్రీవాల్ అన్నట్లు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా భరద్వాజ్ అన్నారు.
తీహార్ జైల్లో కేజ్రీవాల్తో మంత్రి సౌరభ్ భరద్వాజ్ భేటీ !
أبريل 24, 2024
0