జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాంనబీ ఆజాద్ అనంత్నాగ్-రాజౌరి సీటు నుంచి పోటీ చేయట్లేదని ఆ పార్టీ ప్రకటించింది. ఆజాద్ తొలుత ఈ సీటు నుంచి బరిలో నిలుస్తారని ఏప్రిల్ 2న వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన పోటీ చేయడం లేదని, ఇక్కడినుంచి మహ్మద్ సలీం పర్రేను బరిలోకి దించుతున్నట్లు డీపీఏపీ కశ్మీర్ ప్రొవిన్షియల్ అధ్యక్షుడు మహ్మద్ అమీన్ భట్ తెలిపారు. బుధవారం జరిగిన డీపీఏపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆజాద్ తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. అయితే, ఈ సీటు నుంచేనా? లేదా పూర్తిగా ఈ లోక్సభ ఎన్నికలకే దూరంగా ఉంటారా? అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు, ఈ సీటు నుంచి పీడీపీ అభ్యర్థిగా మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, 'ఇండియా' కూటమి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ బరిలో నిలుస్తున్నారు.
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు ?
April 17, 2024
0
Tags