తెలంగాణలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, లాస్య సోదరి నివేదితను అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం విదితమే. దీంతో కంటోన్మెంట్ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. ఇటీవలే షెడ్యూల్ విడుదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల మే 13న జరగనుంది.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత !
April 10, 2024
0
Tags