కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తీహార్‌ జైలు అధికారుల సంచలన నివేదిక !

Telugu Lo Computer
0


ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ అవసరం పెద్దగా లేదని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనాకు తీహార్‌ జైలు అధికారులు నివేదిక అందించారు. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ అవసరం లేదని ఆర్‌ఎమ్‌ఎల్‌ ఆస్పత్రి సూచించిందని తెలిపారు. కేజ్రీవాల్‌ బ్లడ్‌ సుగర్‌ స్థాయిలు అదుపులోనే ఉన్నాయన్నారు. మందులు వాడితే సరిపోతుందన్నారు. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వకుండా ఆయనను చంపేందుకు తీహార్‌ జైలు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) ఆరోపించింది. దీనికి కౌంటర్‌గానే తీహార్‌ జైలు అధికారులు కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై నివేదిక విడుదల చేశారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)