కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం !

Telugu Lo Computer
0


తెలంగాణ భవన్ నుంచి పోరుయాత్రకు మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. భవన్ కు చేరుకున్న కేసీఆర్ కు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. తెలంగాణ భవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన  అనంతరం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. బాణాసంచా కాల్చి బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్ర కొనసాగనుంది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)