ఒడిశాలోని జాజ్పూర్లో ఫ్లైఓవర్ మీద నుంచి ఓ బస్సు కిందపడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 40మంది గాయపడ్డారు. పశ్చిమ్ బెంగాల్లోని హాల్దియా నుంచి పూరీకి వెళుతోంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎన్హెచ్16లోని బారాబతి బ్రిడ్జ్ ఎక్కింది. కొన్ని క్షణాలకే.. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి కిందపడిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీసి, సహాయక చర్యలు చేపట్టారు. "బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నాము. ఒడిశా రోడ్డు ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. గాయపడిన వారిని.. కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజ్కి తరలించాము. క్షతగాత్రులు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు," అని ధర్మశాలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తపన్ కుమార్ నాయక్ మీడియాకు వివరించారు. ఆ సమయంలో సంబంధిత బస్సులో 47మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. క్రేన్ సాయంతో ఆ బస్సును పైకి లాగారు. గ్యాస్ కట్టర్స్ సాయంతో.. మెటల్ని కట్ చేసి, సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. కాగా.. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. బస్సులో ఉన్న వారిలో చాలా మంది పశ్చిమ్ బెంగాల్వాసులను వివరించారు.
ఫ్లైఓవర్ మీద నుంచి బస్సు పడి ఐదుగురు మృతి !
April 16, 2024
0
Tags