ఫ్లైఓవర్​ మీద నుంచి బస్సు పడి ఐదుగురు మృతి !

Telugu Lo Computer
0


డిశాలోని జాజ్​పూర్​లో ఫ్లైఓవర్​ మీద నుంచి  ఓ బస్సు కిందపడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 40మంది గాయపడ్డారు. పశ్చిమ్​ బెంగాల్​లోని హాల్దియా నుంచి పూరీకి వెళుతోంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎన్​హెచ్​16లోని బారాబతి బ్రిడ్జ్​ ఎక్కింది. కొన్ని క్షణాలకే.. ఆ ఫ్లైఓవర్​ మీద నుంచి కిందపడిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీసి, సహాయక చర్యలు చేపట్టారు. "బస్సుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నాము. ఒడిశా రోడ్డు ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. గాయపడిన వారిని.. కటక్​ ఎస్​సీబీ మెడికల్​ కాలేజ్​కి తరలించాము. క్షతగాత్రులు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు," అని ధర్మశాలా పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ తపన్​ కుమార్​ నాయక్​ మీడియాకు వివరించారు. ఆ సమయంలో సంబంధిత బస్సులో 47మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. క్రేన్​ సాయంతో ఆ బస్సును పైకి లాగారు. గ్యాస్​ కట్టర్స్​ సాయంతో.. మెటల్​ని కట్​ చేసి, సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. కాగా.. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.  బస్సులో ఉన్న వారిలో చాలా మంది పశ్చిమ్​ బెంగాల్​వాసులను వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)