భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు (ఎఫ్డిఐ)కు అనుగుణంగా బిబిసి పునర్ నిర్మాణం 'కలెక్టివ్ న్యూస్ రూమ్' ను బుధవారం ప్రారంభించింది. బిబిసి వరల్డ్ సర్వీస్ స్థానంలో ఏర్పాటైన కలెక్టివ్ న్యూస్ రూమ్ భాష ఆధారిత కంటెంట్ను అందించనుంది. "అత్యంత విశ్వసనీయమైన, సృజనాత్మకమైన, సాహసోపేతమైన జర్నలిజాన్ని అందించడానికి అనుభవం, ప్రతిభతో కూడిన మా అద్భుతమైన బృందం స్పష్టమైన లక్ష్యంతో కలెక్టివ్ న్యూస్ రూమ్ను అధికారికంగా ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను" అని కలెక్టివ్ న్యూస్ రూమ్ సిఇఒ రూపా ఝా పేర్కొన్నారు. కలెక్టివ్ న్యూస్ను వాస్తవాలతో, ప్రజా ప్రయోజనాల కోసం, విభిన్న వ్యక్తుల గొంతుకలను, దృక్కోణాలను అందించే స్వతంత్ర వార్తాసంస్థగా ప్రేక్షకులు త్వరలోనే తెలుసుకుంటారని అన్నారు. పన్ను ఉల్లంఘనల పేరుతో గతంలో బిబిసి కార్యాలయాలలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బిబిసి ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజులకే దాడులు, సోదాలు జరగడం గమనార్హం. ప్రభుత్వ వేధింపులతో బిబిసి భారత్లోని తన న్యూస్ రూమ్ను మూసివేసింది. బిబిసిలోని భారతీయ ఉద్యోగులు ఏర్పాటుచేసిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రచురణ లైసెన్స్ను అందించింది.
కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రారంభించిన బిబిసి ఇండియా !
April 10, 2024
0
Tags