వీవీప్యాట్‌ స్లిప్పులను వంద శాతం వెరిఫికేషన్ చేయాలనే పిటిషన్లను కొట్టివేత సుప్రీంకోర్టు ?

Telugu Lo Computer
0

                                              

వీఎంలలో పోలయ్యే ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్‌లతో 100 శాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈవీఎంలో పోలయ్యే ఓట్లను వాటి వీవీప్యాట్ స్లిప్పులతో 100 శాతం వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్‌లు సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సందర్బంగా తాము రెండు ఆదేశాలు ఇస్తున్నట్టుగా సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. మొదటి ఆదేశంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, సింబల్ లోడింగ్ యూనిట్‌కి సీలు వేయాలని వాటిని కనీసం 45 రోజులు నిల్వ చేయాలని స్పష్టం చేసింది. రెండో ఆదేశంలో.. ఫలితాల ప్రకటన తర్వాత ఇంజనీర్ల బృందం ద్వారా ఈవీఎంల మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామ్‌ను తనిఖీ చేయడానికి అభ్యర్థులకు ఎంపిక ఉంటుందని తెలిపింది. అటువంటి అభ్యర్థనను ఫలితాల ప్రకటన తర్వాత ఏడు రోజుల్లోగా చేయవలసి ఉంటుందని పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)