పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరారీ !

Telugu Lo Computer
0

విజయవాడలో పింఛన్లకు ఇవ్వాల్సిన డబ్బులతో సచివాలయ ఉద్యోగి పారిపోయాడు. కృష్ణా పామర్రుకు చెందిన ఊటుకూరి నాగమల్లి విజయవాడ మధురానగర్‌లో ఉన్న 208వ నంబరు సచివాలయంలో అడ్మిన్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. నగర పాలక సంస్థ జోనల్‌ 2లో విధు లు నిర్వర్తిస్తున్న జోనల్‌ కమిషనర్‌ కంచర్ల ప్రభుదాసు ఈ నెల మూడో తేదీ సాయంత్రం 6 గంటలకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి రూ.5.41 లక్షలను నాగమల్లికి అందజేశారు. ఆ రోజు రాత్రి 8 గంటల వరకు ఆయన మొత్తం 14 మంది లబ్ధిదారులకు రూ.42 వేలను పంపిణీ చేశాడు. మిగిలిన రూ.4.99 లక్షలను మర్నాడు ఉదయం నుంచి పంపిణీ చేయాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)