బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని మహాలక్ష్మీపురం లేఅవుట్ ప్రాంతంలో పెద్దగా హడావిగా ప్రశాతంగా ఉంది. అయితే ఇరుకైన రోడ్డులో ఓ మహిళ ఒక ఎద్దును తోలుకుంటూ వెడుతోంది. తాను ముందు పోతూ ఎద్దును తాడుతో లాగుతోంది. ఇంతలో ఉన్నట్టుండి ఆ ఎద్దు వింతగా ప్రవర్తించింది. బైక్పై ఎదురుగా వస్తున్న వాహనదారుడి పైకి పగ బట్టినట్టు దూకి దాడి చేసింది. , కావాలని చేసినట్టు అతడిపై లంఘించింది. ఈ హఠాత్ పరిణామానికి అదుపు తప్పి అతడు ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకుపోయాడు. అయితే లారీ డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, ఎద్దు కదలికను గమనించిన డ్రైవర్ వేసిన బ్రేక్ పనిచేయకపోయినా అతగాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. అదృష్టవశవాత్తూ డ్రైవర్ అలర్ట్ అయి వాహనదారుడి ప్రాణాలను కాపాడాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి.
క్షణం ఆలస్యమైతే గాలిలో కలసి ప్రాణాలే పోయేవి !
April 06, 2024
0
Tags