రేణిగుంటలో ఏనుగుల గుంపు బీభత్సం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏనుగుల హల్ చల్ తో రైతులు కంటిమీద కునుకు లేకుండా బెంబేలెత్తి పోతున్నారు. రేణిగుంట మండలం చైతన్య పురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల గుంపు సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల బీభత్సంతో దాదాపు 80 ఎకరాల్లో పంటలు, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. ఏనుగుల బీభత్సంపై అటవీ శాఖ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ఏనుగుల బారి నుంచి మామిడి చెట్లను రక్షించు కోవడానికి బాణాసంచాను పేల్చి ఏనుగులను తరిమే ప్రయత్నం చేస్తున్న ఫలితం లేదని రైతులు వాపోయారు. ఏనుగుల వల్ల పూర్తిగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)