ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు !

Telugu Lo Computer
0


సికింద్రాబాద్‌లోని ఊర్వశి బార్​ అండ్​ రెస్టారెంట్‌​ను బేగంపేట ఎక్సైజ్​ పోలీసులు మూసివేయించారు. ఇటీవల బార్‌​లో అశ్లీల నృత్యాలు చేస్తుండగా 30 మంది అమ్మాయిలతో పాటు 60మంది కస్టమర్లని పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బార్స్​, రెస్టారెంట్​లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఇటీవల బార్​ అండ్ రెస్టారెంట్​, స్పా సెంటర్ల పేరిట చట్టవ్యతిరేక వ్యాపారాలు మొదలెట్టి అమ్మాయిలను వ్యభిచార ఊబిలోకి దింపుతున్నారు. డబ్బుపై మక్కువతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా బార్​లు, రెస్టారెంట్​లు, స్పా సెంటర్లు వంటి వ్యాపారాలను నడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు, నిరుద్యోగులకు డబ్బు ఆశ చూపించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం​లో తనిఖీలను ముమ్మరం చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)