సికింద్రాబాద్లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ను బేగంపేట ఎక్సైజ్ పోలీసులు మూసివేయించారు. ఇటీవల బార్లో అశ్లీల నృత్యాలు చేస్తుండగా 30 మంది అమ్మాయిలతో పాటు 60మంది కస్టమర్లని పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బార్స్, రెస్టారెంట్లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఇటీవల బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్ల పేరిట చట్టవ్యతిరేక వ్యాపారాలు మొదలెట్టి అమ్మాయిలను వ్యభిచార ఊబిలోకి దింపుతున్నారు. డబ్బుపై మక్కువతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా బార్లు, రెస్టారెంట్లు, స్పా సెంటర్లు వంటి వ్యాపారాలను నడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు, నిరుద్యోగులకు డబ్బు ఆశ చూపించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తనిఖీలను ముమ్మరం చేశారు.
ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు !
April 26, 2024
0
Tags