తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కు 35 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రభాస్ ఇచ్చాడు. ఈ విషయాన్ని దర్శకుడు మారుతీ ధృవీకరించారు. ప్రభాస్ గతంలో కూడా వివిధ సంఘాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా తన మంచి మనసును చాటుకోవడంలో చురుగ్గా ఉన్నాడు. మే 4న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ ఏడాది టాలీవుడ్లో దర్శకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మే 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో దర్శకుల దినోత్సవం జరగనుంది. ప్రముఖ నటీనటులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులకు ఆహ్వానాలు పంపబడ్డాయి.
మూవీ డైరెక్టర్స్ అసోసియేషన్ కు 35 లక్షలు విరాళం ఇచ్చిన ప్రభాస్ !
April 23, 2024
0
Tags