ఎన్నికలను ప్రభావితం చేసేందుకే సీఏఏ అమలు !

Telugu Lo Computer
0


త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదస్పదమైన 'పౌరసత్వ సవరణ చట్టం-2019' ను పార్లమెంట్ ఎన్నికల ముందు అమల్లోకి తేవడం చర్చనీయాంశంగా మారింది. 2019లోనే దీన్ని చట్టంగా మార్చిన కేంద్రం.. అప్పటి నుంచి విధివిధానాలను రూపొందించలేదు. ఇంకా నెల రోజుల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సీఏఏను అమల్లోకి తెచ్చింది. దీంతో 'గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రం ఏం చేసింది?ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఇప్పుడు సీఏఏను అమల్లోకి తెచ్చింది' అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)