భారత బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్కు మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా థార్ జీపును బహుమతిగా ఇచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. భారత జట్టులోకి సర్ఫరాజ్ అరంగేట్రం చేసిన తర్వాత కుమారుడి కోసం పడిన కష్టాన్ని తలుచుకుని నౌషాద్ భావోద్వేగానికి గురయ్యాడు. సర్పరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ సైతం రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నారు. కొడుకులిద్దరినీ క్రికెటర్లుగా తయారుచేసిన నౌషాద్ ఖాన్కు మహీంద్రా థార్ కారును బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు. భారతదేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలనే కలను సాకారం చేసుకునేందుకు సర్ఫరాజ్కు అతని తండ్రి చేసిన త్యాగాలే సహాయపడ్డాయని కొనియాడారు. సర్ఫరాజ్ అత్యంత వేగంగా యాభై పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అతను అరంగేట్రం చేసిన రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు. ముంబయి-ఇంగ్లాండ్ల మధ్య జరిగిన మూడు టెస్టుల్లో ముంబై తరపున మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో చెప్పినట్లుగానే మహీంద్రా సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్కు థార్ జీపును బమహుమతిగా పంపారు. ఖాన్ కుటుంబం దాన్ని అందుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు. సర్ఫరాజ్తో పాటు టెస్టుల్లో అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తండ్రికి ఎప్పుడు గిఫ్ట్ పంపిస్తారని కామెంట్లు పెడుతున్నారు.
సర్పరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్కు థార్ జీపును గిఫ్ట్గా ఆనంద్ మహీంద్రా !
March 23, 2024
0
Tags