ఐపీఎల్‌లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా ధోని !

Telugu Lo Computer
0


పీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూజ్ రావత్‌ను రనౌట్‌ చేసిన ధోని.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 251 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్‌.. 24 రనౌట్లు చేశాడు. ఇంతకు ముందు ఈ అరుదైన రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. 227 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన జడేజా.. మొత్తం 23 రనౌట్‌లు చేశాడు. తాజా మ్యాచ్‌తో జడేజా ఆల్‌టైమ్ రికార్డును 42 ఏళ్ల ధోని బ్రేక్ చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్‌కే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు. తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించేశాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కే బోణీ కొట్టింది. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)