టూరిస్టుల వాహనాన్ని అమాంతం ఎత్తిపారేసిన ఏనుగు !

Telugu Lo Computer
0


క్షిణాఫ్రికాలోని పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో సోమవారం ఈ అనూహ్య ఘటన జరిగింది. 22 సీటర్ సఫారీ ట్రక్కులో పర్యాటకులు ఉండగా, ఓ భారీ ఎనుగు అమాంతం ట్రక్కును ఎత్తిపారేసింది. ఒక్కసారిగా అందులోని టూరిస్టులు చనిపోతామని భయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏనుగును ట్రక్కును అమాతం నేల నుంచి కొన్ని అడుగుల మేర ఎత్తింది. ఈ క్లిప్‌ని హెండ్రీ బ్లోమ్ అనే వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశారు. ఈ సమయంలో ఖచ్చితంగా భయపడ్డాము. ట్రక్కులోని వ్యక్తులు చనిపోతారని భావించానని అతను ఏబీసీ న్యూస్‌కి వెల్లడించారు. ఆ సమయంలో ఏనుగు ట్రక్కు దగ్గరకు వచ్చిన సమయంలో పర్యాటకులు దాక్కునేందుకు ప్రయత్నించారని టూర్ కంపెనీ మాంక్వే గేమ్ ట్రాకర్స్ వెల్లడించారు. ఆ సమయంలో ఏనుగు చాలా దూకుడుగా ఉందని చెప్పారు. అయితే, టూర్ గైడ్ పరిస్థితిని హ్యాండిల్ చేసిన తీరును వన్యప్రాణి నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పార్క్ అధికారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)