ఆదిలాబాద్లో రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధాని మోడీ హైదరాబాద్ లో వర్చువల్గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించారు. ''దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తుంది. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు'' అని మోడీ అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది !
March 04, 2024
0
Tags