పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలిలో టిఎంసి ఎమ్మెల్యే షేక్ షాజహాన్ భూకబ్జాలకు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. షాజహాన్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గత నెల ఫిబ్రవరిలో మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సందేశ్ఖాలిలో లైంగిక వేధింపులకు గురైన ఐదుగురు మహిళలతో సహా హింసకు గురైన పదకొండు మంది బాధితులు శుక్రవారం రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ సందర్భంగా వారంతా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమ్యూనిటీ రక్షించడానికి జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి కోరారు. ఈ బాధితులంతా కలిసి రాష్ట్రపతి ముర్ముకు మెమోరాండం సమర్పించారని ఎస్సీ, ఎస్టీ సపోర్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పార్థ బిస్వాస్ తెలిపారు.
రాష్ట్రపతికి మెమోరాండంని సమర్పించిన సందేశ్ఖాలి బాధితులు
March 15, 2024
0
Tags