రేపు ఎన్నికలకు ముహూర్తం ఖరారు !

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికలు 2024కు ముహూర్తం ఖరారు కానుంది. ప్రస్తుత లోక్‌సభ గడువు  జూన్ 16తో ముగియనుంది. ఆ గడువుకు ముందే కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శనివారం వెలువడనుంది. శనివారం సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్" అమల్లోకి రానుంది. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)