టాటా ఐపీఎల్-2024 ప్రోమో విడుదల

Telugu Lo Computer
0


మార్చి 22న ఐపీఎల్-2024 టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి కూడా ఐపీఎల్ ను స్టార్ స్పార్ట్స్ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ నేపథ్యంలో, టాటా ఐపీఎల్-2024 ప్రోమోను విడుదల చేసింది. ఈ యాడ్ వీడియోలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా తమదైన శైలిలో రక్తికట్టించారు. ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈసారి ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ను ప్రకటించలేదు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు కేవలం రెండు వారాలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించారు. ఈ వ్యవధిలో 21 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తేదీలు సర్దుబాటు చేసుకుని పూర్తి షెడ్యూల్ ప్రకటించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)