రూ.1.57 లక్షల విలువైన బంగారాన్ని కాజేసిన నకిలీ పోలీసులు

Telugu Lo Computer
0


హారాష్ట్ర లోని థానే నగరం, మజివాడలో ముగ్గురు వ్యక్తులు పోలీసులమని చెప్పి  ఓ మహిళ నుంచి రూ.1.57 లక్షల విలువైన బంగారాన్ని దోచుకున్నారని పోలీసు అధికారి ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 28న, ముగ్గురు నిందితులు 56 ఏళ్ల మహిళతో ఈ ప్రాంతంలో అనేక చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని, బంగారు ఆభరణాలు ధరించడం సురక్షితం కాదని, ముందుజాగ్రత్త చర్యగా తాము ఇచ్చిన కవర్‌లో రూ.1.57 లక్షల విలువైన రెండు బంగారు గాజులు వేయాలని అడిగారని  బాధితురాలికి తిరిగి ఇచ్చే సమయంలో ఖాళీగా ఉన్న కవర్‌ను వేగంగా మార్చేసి అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు.కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కపూర్‌బావడి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)