పొటాషియం లోపం - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


పొటాషియం శరీరంలో నీటి పరిమాణంతో పాటు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడతాయి. శరీరంలో సరిపడ పొటాషియం లేకపోతే కొన్ని రకాలస సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల లక్షణాల ద్వారా పొటాషియం లోపాన్ని గుర్తించవచ్చు. శరీరంలో సరిపడ పొటాషియం లేకపోతే కండరాలు బలహీనంగా మారుతాయి. నిత్యం కండరాలు పట్టుకుపోయిన భావన కలుగుతుంది. ఇది పొటాషియం లోపానికి ముఖ్య లక్షణంగా చెప్పొచ్చు. కొందరిలో నిత్యం అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొన్ని సందర్భాల్లో ఆకలిలేకపోవడం, మానసిక కుంగుబాటుకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో పొటాషియం లోపిస్తే.. ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, నిత్యం వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. మలంలో రక్తం రావడం కూడా పొటాషియం లోపానికి సూచనగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనకు రోజుకు 2.5 గ్రాముల నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం పడుతుంది.

పొటాషియం ఎక్కువగా లభించాలంటే ప్రతీ రోజూ ఒక కోడి గుడ్డును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నరు. గుడ్డులోని పోషకాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. టమాటలు, చిలగడ దుంపలు, నట్స్‌ వంటి వాటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పొటాషియం లోపాన్ని జయించవచ్చు. పొటాషియం లోపాన్ని అరటి పండ్లతో చెక్‌ పెట్టొచ్చు. పొటాషియంకు అరటి పండు పెట్టింది పేరు. రక్తపోటును తగ్గించి, మానసిక ప్రశాంతను, మంచి నిద్రను అందిస్తాయి. పాలు, పెరుగు, మాంసం, నారింజ, కివీ కొబ్బరి నీళ్లలో కూడా పుష్కలంగా పొటాషియం లభిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)