మంచు కురుస్తున్నప్పటికీ చలించకుండా యోగి ధ్యానం ?

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో సత్యేంద్రనాథ్‌ అనే యోగి ధ్యానం చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకవైపు దట్టంగా మంచు కురుస్తున్నప్పటికీ యోగి మాత్రం ధ్యాననిద్రలో మునిగిపోయాడు. తన శరీరంలో ఏమాత్రం చలనం లేనంతగా ఆయన లీనమైపోయాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు అదంతా ఏఐ సృష్టేనంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది ఫేక్ కాదని నిజమైన వీడియోనే అని చెబుతున్నారు. ఈ యోగిని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. బంజర్‌కు చెందిన సత్యేంద్రనాథ కౌలంటక్ పీఠ్ ఆశ్రమంలో గత 22 యేళ్లుగా యోగా అభ్యసిస్తున్నారు. ఆయన అనుచరులను ఇష్పుత్ర అని పిలుస్తారు. సత్యేంద్రనాథ్ గురువు ఇష్‌నాథ్ హిమాలయ యోగా సంప్రదాయాన్ని అనుసరించేవారు. ఆయన కౌలాంటక్ పీఠానికి అధిపతి కూడా. ఈ పీఠం యోగా, దైవిక అభ్యాసాలకు స్థావరంగా ఉంది. ఇష్పుత్ర భక్తులు ఎనిమిదికి పైగా ప్రదేశాలలో విస్తరించి యోగా, భక్తి అభ్యాసాలను ప్రోత్సహిస్తున్నారు. సత్యేంద్రనాథ్ గడ్డకట్టిన మంచులో యోగా చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చాలా మందిని ఆకర్షించింది. ఇష్పుత్రలో చిన్నప్పటి నుంచే యోగాభ్యాసం మొదలవుతుంది. హిమపాతం మధ్య యోగాను అభ్యసించడానికి కఠిన శిక్షణ పొందుతారు. సవాలు చేసే వాతావరణ పరిస్థితుల్లో ఇష్పుత్ర ధ్యానానికి సంబంధించిన ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. కాగా, వైరల్ అవుతున్న వీడియోను ఈ నెల ప్రారంభంలో ఇష్పుత్ర శిష్యుడు రాహుల్ షూట్ చేశాడు. భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు సత్యేంద్రనాథ్ యోగాభ్యాసాన్ని, ధ్యానాన్ని ఆయన తరచూ వీడియోలో బంధిస్తుంటారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)