అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గృహ ప్రవేశం !

Telugu Lo Computer
0


కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి గురువారం అమేథీలో గృహ ప్రవేశం చేశారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమేథీలో ఆమె గృహ ప్రవేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. గత ఎన్నికల్లో తాను గెలిస్తే అమేథీని శాశ్వత ఇంటి అడ్రస్‌గా మార్చుకుంటానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. గాంధీల కుటుంబానికి కంచుకోట అమేథీలో తొలిసారి రాహుల్ గాంధీని ఓడించారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2021లో అమేథీలో స్మృతి ఇరానీ 15వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేశారు. 2023లో 'కిచ్డీ బోజ్' అనే కార్యక్రమం నిర్వహించి, తాజాగా గృహ ప్రవేశం నిర్వహించారు. ఉజ్జయని పూజారి ఆశిశ్ మహరాజ్ ఆధ్వర్యంలో ఆమె గృహ ప్రవేశ వేడుక నిర్వహించారు. 2014 నుంచి రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ పోటీ పడుతున్నారు. 2014లో ఓటమి పాలైనా, 2019లో రాహుల్ గాంధీని ఓడించి సంచలన విజయం సాధించారు. 2004 నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందిన రాహుల్ గాంధీకి 2019 ఎన్నికల్లో ఓటమి పరాభవాన్ని మిగిల్చింది. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ వారు మళ్లీ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)