తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం బద్దిపడగ గ్రామంలో మూడేళ్ల చిన్నారి మతిస్థిమితం లేని మేనమామ చేతిలో హతమైన ఘటన జరిగింది. శిరీష (3) తల్లి సంతోషితో కలిసి గ్రామంలోని పొలానికి వెళ్లింది. తల్లి పొలంలో పనిచేస్తుండగా.. సమీపంలో ఆడుకుంటున్న శిరీషను ఆమె మేనమామ శ్రీనివాస్ బురదలో తొక్కి హతమార్చాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
మతిస్థిమితం లేని మేనమామ చేతిలో మూడేళ్ల చిన్నారి హతం !
February 24, 2024
0
Tags