నది ఒడ్డున శవమై తేలిన దర్శకుడు వెట్రి దురైసామి !

Telugu Lo Computer
0


ఇంద్రావతు ఒరు నాల్ సినిమా దర్శకుడు వెట్రి దురైసామి హిమాచల్ ప్రదేశ్‌లో తన స్నేహితులు గోపీ నాథ్ -తంజిన్‌లతో కలిసి విహారయాత్రకు వెళుతుండగా కారు సట్లెజ్ నదిలో పడిపోవడంతో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ప్రమాదం ఎలా జరిగిందనే దాని గురించి చాలా సమాచారం లేదు, అయితే తంజిన్‌ కారును నడుపుతున్నట్లు తెలుస్తుంది.  గోపీ నాథ్‌కు తీవ్ర గాయాలు కాగా, తంజిన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అయితే, వెట్రి తప్పిపోయినట్లు తెలిసి అప్పటి నుంచి రెస్క్యూ టీమ్ అతన్ని వెతుకుతోంది. తొమ్మిది రోజుల తర్వాత దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం సట్లెజ్ నది ఒడ్డున లభ్యమైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)