మహారాష్ట్ర లోని పూణెలో పోలీసులు 1.75 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మార్కెట్లో మెఫెడ్రోన్ ధర రూ.3.85 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా మరో రెండు గోదాములను గుర్తించారు. అందులో 55 కిలోల ఎండీని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని విచారించి.. ఇన్పుట్స్ ఆధారంగా కుర్కుంభ్ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో మరో ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో 550 కిలోల ఎండీని స్వాధీనం చేసుకున్నట్లు పుణే పోలీస్ కమిషన్ అమితేశ్ కుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఎండీ డ్రగ్ విలువ రూ.1100కోట్ల వరకు ఉంటుందని అధికారులు వివరించారు.
పూణెలో రూ.1100కోట్ల మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం
February 20, 2024
0
Tags