బిడ్డ కోసం మెట్రో ట్రాక్‌పై దూకిన తల్లి ?

Telugu Lo Computer
0


హారాష్ట్ర లోని పుణే సివిల్‌ కోర్టు మెట్రో స్టేషన్‌ వద్ద ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్‌ మీద పడిపోగా ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న వికాస్‌ బంగర్‌ అనే సెక్యూరిటీ గార్డ్‌ సకాలంలో స్పందించకుండా ఉంటే ఘోరమే జరిగేది. పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్‌ నొక్కారు. దీంతో స్టేషన్‌కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్‌ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)