భారత్ జోడో న్యాయ్ యాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఖర్గే !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మణిపూర్ నుంచి మొదలైంది. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, ప్రజలందరికీ న్యాయం అనే సందేశంతో రాహుల్ గాంధీ సారథ్యంలో చేపట్టిన ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రాహుల్‌కు జెండా అందజేశారు. తౌబల్ జిల్లాలోని ఖాంగ్జోమ్ వార్ మెమోరియల్ నుంచి ఈ యాత్ర మొదలైంది. ఈ యాత్ర 12 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజగ వర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 6,713 కిలోమీటర్లు సాగుతుంది. 67 రోజుల పాటు సాగే ఈ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. రాజ్యాంగ పీఠికను పరిరక్షించేందుకు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడుకు (మణిపూర్) ఓట్లు అడిగేందుకు వస్తారే కానీ, ప్రజల బాధలు తెలుసుకునేందుకు మాత్రం రారని విమర్శించారు. బీజేపీ రాజకీయాల వల్లే మణిపూర్ విశిష్టతను కోల్పోయిందని రాహుల్ ఈ సందర్భంగా విమర్శించారు. 2022 జూన్ 29 తర్వాత ప్రభుత్వ నిర్మాణం కుప్పకూలిందని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్‌లో 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరుగుతుంది. మణిపూర్‌తో పాటు నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లో యాత్ర కొనసాగుతుంది. నాగాలాండ్ (రెండు రోజులు, 257 కిలోమీటర్లు) అరుణాచల్ ప్రదేశ్ (55 కిలోమీటర్లు, ఒకరోజు), మేఘాలయ (5 కిలోమీటర్లు, ఒకరోజు), అసోం (833 కిలోమీటర్లు, 8 రోజులు),  పర్యటన జరుపుతారు. హిందీ రాష్ట్రాలైన బీహార్, జార్ఖాండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, గుజరాత్ లో పర్యటన సాగించి మార్చి 20, 21 తేదీల్లో మహారాష్ట్రలో ముగుస్తుంది. ప్రధానంగా బస్సులోనూ, పాదయాత్ర గానూ ఈ యాత్ర సాగుతుంది. యాత్ర సందర్భంగా ప్రతిరోజూ రాహుల్ రెండు ప్రజా సభల్లో ప్రసంగిస్తారు. వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖీ ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)