వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనేందుకు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం సాయంత్రం గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఇద్దరూ ఈరోజు నగరంలో రోడ్షో నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా, ఇతర అధికారులు యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. యూఏఈ ప్రెసిడెంట్ రాకతో ఆయనకు ఉత్సవ గౌరవాన్ని అందించారు. యుఎఇ ప్రెసిడెంట్తో పాటు, తైమూర్ లెస్టె ప్రెసిడెంట్ జోస్ రామోస్-హోర్టాతో సహా ఇతర ప్రపంచ నాయకులు వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్కు హాజరవుతున్నారు. గుజరాత్లోని మహాత్మా మందిర్లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 10వ ఎడిషన్ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన కోసం సోమవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. గుజరాత్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. రాబోయే రెండు రోజుల్లో వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ మరియు సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ సమ్మిట్లో వివిధ ప్రపంచ నాయకులు మాతో కలుస్తారు. నా సోదరుడు మొహమ్మద్ బిన్ జాయెద్ రావడం చాలా ప్రత్యేకమైనది. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్తో నాకు చాలా సన్నిహిత అనుబంధం ఉంది మరియు ఈ వేదిక గుజరాత్కు ఎలా దోహదపడిందో చూసి నేను సంతోషిస్తున్నాను అని మోడీ పోస్ట్ లో పంచుకున్నాడు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2003లో మోడీ నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైంది. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ పదో ఎడిషన్ జనవరి 10-12 వరకు గాంధీనగర్లో జరుగుతోంది. ఈ ఏడాది సమ్మిట్లో 34 భాగస్వామ్య దేశాలు మరియు 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొంటాయి.సమ్మిట్ లో పరిశ్రమ 4.0, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్, సస్టైనబుల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ వంటి వాటిపై ప్రపంచవ్యాప్తంగా సంబంధిత అంశాలపై సెమినార్లు మరియు కాన్ఫరెన్స్లతో సహా వివిధ ఈవెంట్లను నిర్వహిస్తుంది. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోలో కంపెనీలు ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్థాయి.
యూఏఈ అధ్యక్షుడికి మోడీ స్వాగతం !
January 09, 2024
0
Tags