మధ్యప్రదేశ్‌ లో అనాగరిక ఘటన !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గుణా జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటి మందు కూర్చొని ఉండగా  అతని వద్దకు రెండు చిన్న కుక్క పిల్లలు వచ్చాయి. దీంతో అతను ఓ కుక్క పిల్లను పట్టుకొని విచక్షణరహితంగా నేలకు విసిరికొట్టాడు. అక్కడికి ఆగకుండా ఆ కుక్క పిల్లను కాలుతో నలిపేశాడు. ఈ దారుణ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తన దృష్టికి రావటంతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ ఈ అనాగరికమైన ఘటనకు పాల్పడిన వ్యక్తిపై జరిమానా విధించాలని ముఖ్యమంత్రి చౌహాన్‌ను ఎక్స్‌( ట్విటర్‌) ద్వారా కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 'అనాగరిక ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. కచ్చితంగా బాధ్యులు పర్యవసానాలు ఎదుర్కొంటారు'అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ​

Post a Comment

0Comments

Post a Comment (0)