ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ అమ్దై మైన్స్లో నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలి ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మరో సైనికుడు గాయపడ్డాడు. గనుల్లోని పలుచోట్ల ఐఈడీలను అమర్చుతామని నక్సల్స్ హెచ్చరించారు. గతంలో ఐఈడీ పేలుడులో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ ఐఈడీ దాడిలో సైనికుడిని కమలేష్ సాహుగా గుర్తించారు. ఆయన స్వస్థలం జంజ్గిర్ చంపా జిల్లా హసౌద్ గ్రామం. నారాయణ్పూర్ లోని ఛోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్డై గనిలో ఉదయం నక్సలైట్లు ఐఈడీని పేల్చడంతో పాటు కాల్పులు జరిపారని బస్తర్ ఐజీ సురందర్ రాజ్ తెలిపారు. నక్సల్స్ దాడిలో సీఎఎఫ్ 9 వ కార్ప్కు చెందిన కానిస్టేబుల్ కమలేష్ కుమార్ వీర మరణం పొందారని తెలిపారు. కానిస్టేబుల్ వినయ్ కుమార్కు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.
నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలి ఓ జవాన్ మృతి
December 13, 2023
0
Tags