అకారణంగా దంపతులను చావబాదిన దుండగులు !

Telugu Lo Computer
0


ణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో ఢిల్లీలో నివాసముంటున్నాడు. తన స్నేహితుడిని భోజనం చేసేందుకు ఇంటికి ఆహ్వానించాడు. ఆలస్యం కావడంతో అతడిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు తన భార్య, చెల్లితో సహా వచ్చాడు. వారు నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. తన ఫోన్‌ డెడ్‌ అయ్యిందని, క్యాబ్‌ బుక్‌ చేసుకునేందుకు సాయం చేయమని ఓ వ్యక్తి కోరాడు. మణిపూర్‌ వ్యక్తి కూడా అందుకు అంగీకరించాడు. ఈ క్రమంలోనే ఎదురుగా ఉన్న అతడి భార్య, చెల్లిపై అకారణంగా ఆ వ్యక్తి దుర్భాషలాడాడు. ఇంతలో ఆ దుండగులకు తోడుగా మరికొందరు వచ్చారు. సాయం చేయాలనుకున్న వారిపై దాడికి దిగింది ఆ గుంపు. మహిళలనే కనికరం చూపకుండా కిందపడేసి చావబాదారు. ఈ ఘటనను చుట్టు పక్కల ఉన్న వారు భవనాలపై నిలబడి చోద్యం చూశారే కానీ, ఏ ఒక్కరు కాపాడేందుకు ముందుకు రాలేదు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)