శబరిమల ఆలయం వద్ద చిన్నారి మృతి

Telugu Lo Computer
0


బరిమల ఆలయం వద్ద గుండె సంబంధిత సమస్య తో బాధపడుతున్న చిన్నారి దర్శనం కోసం క్యూలైన్‌లో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.  దర్శనానికి కొందరు భక్తులు 18 గంటలపాటు వేచిచూడాల్సి వస్తోంది. ఎక్కువ సమయం నిరీక్షించలేక చాలా మంది యాత్రికులు క్యూ వ్యవస్థను అతిక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. బారికేడ్‌లను దూకేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా పవిత్ర మెట్ల దగ్గర అనియంత్రిత రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో దర్శనం కోసం క్యూలైన్‌లో వేచివున్న 11 ఏళ్ల బాలిక చనిపోయింది. గుండె సంబంధిత సమస్యతో బాలిక మృతి చెందింది. సుదీర్ఘ సమయం క్యూలైన్‌లో వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మృతి చెందింది. బాలిక గత మూడేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)