ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ పట్టణంలో పాస్పోర్టు వెరిఫికేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఇష్రత్ అనే మహిళ పై అదే సమయంలో ఓ అధికారి చేతుల్లో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ మహిళకు తాకడంతో అక్కడే నేలపై పడిపోయింది. నిందితుడైన పోలీస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పాస్పోర్టు వెరిఫికేషన్లో అధికారి డబ్బుకోసం మహిళను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వాగ్వాదం జరగడంతో ఆ అధికారి ఆమెను షూట్ చేశారని కుటుంబం తెలిపింది. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఆమె పోలీస్ స్టేషన్ వెళ్లిందని, డబ్బు కోసం కాల్స్ వస్తున్నాయని, ఆమెను ఎవరు కాల్చారో తెలియదని మహిళ బంధువు జీషన్ చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్స్పెక్టర్ మనోజ్ శర్మను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గాయపడిన బాధితురాలకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది. దీని ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ తల వెనక భాగంలో గాయమైందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఉమ్రా, మినీ తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటుందని బంధువులు తెలిపారు.
పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లిన మహిళపై తుపాకీ మిస్ఫైర్ !
December 08, 2023
0
Tags