కోచింగ్ సెంటర్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు !

Telugu Lo Computer
0

ముంబైలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టీచర్. ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోన్ కోలివాడ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో 16 ఏళ్ల విద్యార్థిని కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో.. బాధితురాలి కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని ఈ సంవత్సరం కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ తీసుకుంది. అయితే ఓ టీచర్.. తరచూ ఆమెను వేధించేవాడని.. పలుమార్లు లైంగికంగా వేధించాడని బాధితురాలు తెలిపింది. నిందితుడి చర్యలతో విసిగిపోయిన విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆగస్టులో మరో ఉపాధ్యాయుడి రాసలీలలు వెలుగులోకి రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ముంబై ఠాగూర్ నగర్‌లోని ఓ పాఠశాలలో ఒకటిన్నర నెలల్లోనే ఓ స్పోర్ట్స్ టీచర్ తన భోగభాగ్యాలకు నలుగురు విద్యార్థినులను బలితీసుకున్నాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా విద్యార్థినులపై అత్యాచార ఘటనలకు పాల్పడ్డాడు నిందితుడు. చివరకు విసుగు చెంది బాధిత విద్యార్థులు విషయాన్ని బయటపెట్టారు. బాధిత బాలికల ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు ఈ సంఘటనలను అంగీకరించడమే కాకుండా, మునుపటి పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డాడని చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)