ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న తుఫాన్ ముప్పు !

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయం- థాయ్‌లాండ్ దక్షిణ ప్రాంతం గగనతలంపై ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం వచ్చే 29వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది- తుఫాన్‌గా మారడానికి అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి పేర్కొంది. డిసెంబర్ 1వ తేదీ నాటికి తుఫాన్‌గా ఆవిర్భవిస్తుందని ఐఎండీ అంచనా వేసింది. క్రమంగా అండమాన్ నికోబార్ ద్వీపానికి పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని, డిసెంబర్ 4 లేదా 5 తేదీల్లో ఏపీ తీరానికి సమీపిస్తుందని వివరించింది. దీని ప్రభావం ఈ నెల 1వ తేదీ నుంచి ఏపీ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుఫాన్‌కు మిఛౌంగ్ అని పేరు పెట్టారు. మయన్మార్ ఈ పేరును సూచించింది. ఈ ఏడాదిలో బంగాళాఖాతంలో ఏర్పడబోయే నాలుగో తుఫాన్ ఇదే అవుతుంది. హిందూ మహా సముద్రంలో ఇప్పటివరకు ఆరు తుఫాన్లు ఏర్పడ్డాయి. ఈ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే అండమాన్ నికోబార్‌లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్ష తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది కూడా. మరో 48 గంటల పాటు వర్షాలు పడొచ్చని తెలిపింది. చేపలవేటకు వెళ్లకూడదని మత్స్యకారులను హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)