కాంట్రాక్టర్‌ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని నోయిడాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో కాంట్రాక్టర్‌ను హత్య చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. 57 ఏళ్ల కాంట్రాక్టర్‌ శశి శర్మకు 2021లో పొరుగింటికి చెందిన భరత్ చౌహాన్‌తో పరిచయమైంది. ఈ క్రమంలో భరత్‌ భార్య, శశి శర్మ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది భరత్‌ దృష్టికి రావడంతో అతడు మరో చోటుకు ఇల్లు మారాడు. కాగా, ఇల్లు మారినప్పటికీ శశి శర్మ, భార్య మధ్య వివాహేతర సంబంధం కొనసాగడం భరత్‌కు తెలిపింది. దీనిపై అతడు నిలదీయగా క్షమించమని భార్య కోరింది. మరోవైపు భరత్‌ టీ షాపు ప్రారంభించాడు. నోయిడాలోని ప్రైవేట్‌ వర్సిటీలో చదువుతున్న రాజా తివారీ రోజూ అక్కడకు వచ్చి టీ తాగేవాడు. ఈ నేపథ్యంలో వారిద్దరు స్నేహితులయ్యారు. మరోవైపు తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న కాంట్రాక్టర్‌ శశి శర్మపై పగ తీర్చుకోవాలని భరత్‌ ప్లాన్‌ చేశాడు. ఆదివారం భార్య సీమా దేవి, స్నేహితుడు తివారీతో కలిసి అతడి ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా వాగ్వాదం జరుగడంతో సీమ చెంపపై శశి కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు కలిసి అతడి గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మెడ వద్ద కత్తి గాయాలు ఉండటంతో శశి శర్మను హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. దర్యాప్తు జరిపి నిందితులైన భరత్, అతడి భార్య సీమా దేవి, రాజా తివారీని అరెస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)