వెయ్యి ఏళ్ల నాటి రోమన్ నాణేలు లభ్యం !

Telugu Lo Computer
0


టలీ లోని సార్డినియా తీరంలో సముద్రగర్భాన్ని కొంతమంది డైవర్లు అన్వేషిస్తుండగా ఇసుక కింద పాతిపెట్టిన కొన్ని లోహపు వస్తువులు కనిపించాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు అవేవో పాత్రలు కావచ్చు అని అభిప్రాయపడ్డారు. అయితే వాళ్లలో ఆసక్తి ఆ పాత్ర ను పరిశీలించేలా, ఆ ప్రాంతాన్ని మరింత తవ్వేలా ప్రేరేపించింది. ఈ నేపథ్యంలో వెయ్యి సంవత్సరాల కంటే ముందు కాలం నాటి రోమన్ నాణేలు కనిపించాయి. అవి దాదాపు 30,000 నుండి 50,000 ఉన్నాయి. కాగా అవి కోట్ల ధర పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పురావస్తు శాస్త్రవేత్తలు ఆ నాణేలని పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ  ఈ నాణేలు కాంస్యవని, రోమన్ సామ్రాజ్యానికి సాక్ష్యంగా ఉండవచ్చని తెలిపారు. అలానే ఈ నాణేలను ఫోలిస్ అని పిలుస్తారని, వీటిని 294 ADలో రోమన్ చక్రవర్తి డయోక్లెటియన్ విడుదల చేశారని పేర్కొన్నారు. కాగా అక్కడి ప్రభుత్వం వాటిని భద్రపరిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)