అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే ఐసిసి ప్రపంచ కప్ 2023 ఫైనల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ధోని నేతృత్వంలో వాంఖడే స్టేడియంలో శ్రీలంకను ఓడించి 2011లో టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రముఖ అంతర్జాతీయ గాయని దువా లిపా కూడా టోర్నమెంట్ ముగింపు వేడుకలో పాల్గొననున్నారు. మోడీ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రానుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు వరుసగా 10 విజయాలతో అజేయంగా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా వరుస విజయాలతో ఊపు మీద ఉంది. కాగా 2023కి ముందు భారత్ మొత్తం 3 సార్లు ఫైనల్కు చేరుకుంది. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో తొలిసారి టైటిల్ను గెలుచుకుంది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు నరేంద్ర మోడీ !
November 17, 2023
0
Tags