జమ్మూ కాశ్మీర్లోని ఉద్దంపూర్ జిల్లా రామ్నగర్-బలాంద్ రహదారిపై ఓ మినీ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రామ్నగర్లోని సబ్ హాస్పిటల్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని ఉధంపూర్ ఏఎస్పీ అన్వర్ ఉల్ హక్ తెలిపారు.
అదుపు తప్పి రాళ్ల గుట్టను ఢీకొట్టిన మినీ బస్సు
October 27, 2023
0
Tags