కేరళలోని కొచ్చిలో అక్టోబర్ 25న షావర్మా తిని ఫుడ్ పాయిజనింగ్తో చికిత్స పొందుతూ ఓ 24 ఏళ్ల యువకుడు మరణించాడు. అనంతరం ఫుడ్ ఆఫర్ చేసిన రెస్టారెంట్ను అధికారులు మూసివేసినట్లు సమాచారం. అక్టోబర్ 18న కొట్టాయం వాసి రాహుల్ నాయర్ లే హయత్ రెస్టారెంట్ నుంచి షావర్మా భోజనం ఆర్డర్ చేశాడు. అతను ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత అక్టోబర్ 19 న కక్కనాడ్లోని సన్రైజ్ ఆసుపత్రిలో చేరాడు. నాయర్ అదే రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే బలహీనత కారణంగా అక్టోబర్ 22న మరోసారి ఆసుపత్రిలో చేరాడు. అనంతరం నాయర్ పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో అతనిపై విషప్రయోగం జరిగిందన్న విషయం స్పష్టమైంది. అయితే అది ఆహారం వల్ల జరిగిందా, లేదా అనేది నిర్ధారించుకోవడానికి పరీక్ష ఫలితాల కోసం వేచి చూడాల్సింది. రాహుల్ కిడ్నీ, కాలేయం పాడైపోయి గుండెపోటుకు గురయ్యారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
షావర్మా చికెన్ తిని యువకుని మృతి ?
October 26, 2023
0
Tags