ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లాలో దాహోద్‌- అలీరాజ్‌పూర్‌ హైవేపై వెళుతున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ చిన్నారి, మహిళ, నలుగురు పురుషులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పటియాజోల్‌ గ్రామంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో రిక్షా డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)