నవీన్‌ పట్నాయక్‌ కార్యదర్శి వీకే పాండియన్‌ కు కేబినెట్‌ మంత్రి హోదా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 24 October 2023

నవీన్‌ పట్నాయక్‌ కార్యదర్శి వీకే పాండియన్‌ కు కేబినెట్‌ మంత్రి హోదా !

డిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి వీకే పాండియన్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంటనే కేబినెట్‌ మంత్రి హోదా కల్పించారు. హడావుడిగా ఆయనకు ఇంతటి కీలకమైన పదవిని ఇవ్వడంతో ఆయనే రాష్ట్రానికి తదుపరి సీఎం అనే చర్చ జోరందుకుంది. వీకే పాండియన్ పూర్తి పేరు వీ కార్తికేయ పాండియన్. ఆయన 1974 మే 25న తమిళనాడులో జన్మించారు. దాదాపు 23 ఏళ్లుగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సన్నిహితంగా ఉన్నారు. ఆయనను సీఎం పట్నాయక్ వారసుడిగా పిలుచుకోవడంలో కారణం లేకపోలేదు. 2000 సంవత్సరంలో ఒడిశా కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన పాండియన్, పదవి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రికి ఇష్టమైన వ్యక్తిగా మారారు. 2002లో కలహండి జిల్లాలోని ధరమ్‌గఢ్ సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2005లో తొలిసారిగా మయూర్‌భంజ్ జిల్లా డీఎం అయ్యారు. ఆ తర్వాత 2007లో సీఎం సొంత జిల్లా గంజాంకు బదిలీ అయ్యారు. 2011లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పోస్టింగ్‌ పొందినప్పటి నుంచి ఆయన సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ప్రైవేట్‌ సెక్రటరీగా ఉన్నారు.

No comments:

Post a Comment