కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 26 October 2023

కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

మ్ము కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాటుకి యత్నించిన ఉగ్రవాదుల్ని కశ్మీర్‌ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా గురువారం ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కశ్మీర్‌ పోలీసులు ప్రకటించారు. సరిహద్దు వెంట చొరబాటు కార్యకలాపాల నియంత్రణకు సైన్యం, జమ్ము పోలీసులతో కలిసి ఆపరేషన్‌ చేపట్టింది. కుప్వారా జిల్లా మచిల్‌ సెక్టార్‌లో ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు.. ఆపై కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయినట్లు జమ్ముకశ్మీర్‌ అదనపు డీజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారాయన. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు నిరోధక ఆపరేషన్లలో పోలీసు బలగాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారీ ఆపరేషన్‌ చేపట్టారు. కశ్మీర్‌కు చెందిన పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్‌లో బుధవారం భేటీ అయ్యారు.

No comments:

Post a Comment