ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం !

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా కదలుతూ ఈ నెల 20 నాటికి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో కోస్తాంద్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఈ నెల 23 నుంచి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశముందని అన్నారు. మరో ఐదురోజుల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడం, అలాగే అల్పపీడనంతో ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నయన్నారు. అవి వస్తే ఒక్కసారిగా రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)