జొమాటో, మెక్‌డొనాల్డ్స్‌కి రూ.1 లక్ష జరిమానా !

Telugu Lo Computer
0


రాజస్తాన్ లోని జోధ్‌పూర్ నగరంలో ఓ వినియోగదారుడికి జొమాటో వెజ్ స్థానంలో నాన్-వెజ్ ఫుడ్‌ని డెలివరీ చేసింది. ఈ వివాదంలో జిల్లా వినియోగదారుల ఫోరం జొమాటోతో పాటు రెస్టారెంట్ భాగస్వామి మెక్‌డొనాల్డ్స్‌కి కలిపి రూ. 1 లక్ష జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు జొమాటో సిద్ధమైంది. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఫోరమ్ (II) జోధ్‌పూర్, వినియోగదారుల రక్షణ చట్టం-2019ని ఉల్లంఘించినందుకు జొమాటో మరియు రెస్టారెంట్ భాగస్వామి అయిన మెక్‌డొనాల్డ్స్‌పై రూ. 1 లక్ష జరిమానా విధించింది. మానిటరీ పెనాల్టీ, లిటిగేషన్ ఖర్చును రూ.5000 భరించాలని తీర్పు చెప్పింది. అయితే ఈ కేసులో జొమాటో ఆర్డర్‌కి వ్యతిరేకంగా అప్పీల్ చేసే ప్రక్రియలో ఉంది. కస్టమర్‌కి ఆర్డర్ అందించే సేవల్ని మాత్రమే జొమాటో చేస్తోంది, ఆర్డర్ తప్పుగా రావడం, నాణ్యత లేకపోవడం వంటివి రెస్టారెంట్ బాధ్యతే అని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)