భయకంపితులను చేసిన కేదార్‌నాథ్‌లో అవలాంచ్‌ !

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో అవలాంచ్‌ భయకంపితులను చేసింది. ఆలయం సమీపంలోనే ఎత్తైన పర్వత సానువుల నుంచి మంచుఫలకాలు విరిగిపడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇవాళ ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపాయి. ఆరు నెలల విరామం అనంతరం ఏప్రిల్‌ 25న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. కేదారేశ్వరుడిని దర్శించేందుకు వేల సంఖ్యలో భక్తులు కాలినడకన వెళ్తున్నారు. అయితే ఇటీవల వరదల కారణంగా పలుమార్లు యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)