చెరువులోకి దూసుకెళ్లిన బస్సు !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు 25 మంది ప్రయాణీకులతో అతి వేగంతో ఉన్న బస్సు రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ చెరువులోకి దూసుకెళ్లింది. ఇక, ఈ ఘటనను బస్సు వెనకాలే ఉన్న ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు. కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. అయితే, బస్సు చెరువులో పడిపోయిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. దీంతో, ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)